అయేషా _సత్యం కేసు బాబు : నిజా నిజాలు ఏమిటి ? : సత్యం బాబుకి శిక్ష పడటం చాలా మంది సంతోషంగా లేరు, సాధారణంగా ఇటువంటి కేసుల్లో శిక్ష వేయాలని చాలా మంది కోరుకుంటారు, ఎన్నో మహిళా సంఘాలు ఆందోళన చేస్తారు , కానీ కేసు తీర్పు విన్నాక కేసు తీర్పు అన్యాయం అని మహిళా సంఘాలు, సత్యం బాబు తల్లి మరియు ముఖ్యంగా అయేషా తల్లి కూడా అమాయకుడికి శిక్ష పడింది అని చెప్పటం గమనార్హం.
కేసు విచారణలో ఎన్నో లొసుగులు ఉన్నాయి :
1 ) అసలు అయేషా రేప్ & మర్డర్ జరిగిన హాస్టల్ వార్డెన్ గానీ , సెక్యూరిటీని గానీ , బిల్డింగ్ యజమానిని కానీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు , కనీసం విచారణ అయినా ఎందుకు చేయలేదు ?
2 ) అయేషా తల్లి చాలా మంది పేర్లు అనుమానితులు అని చెప్పింది , ఆమె మాటలు ఎందుకు పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు?
౩) ఈ కేసులో ముందుగా నిందుతుడు అని లడ్డు ని ప్రవేశపెట్టారు , తరువాత కాదు అని చెప్పారు ఎందుకు? సరే అక్కడ లబించిన పాద ముద్రికలు లడ్డు పద ముద్రికలుతో సరిపోయాయి అన్నారు , తరువాత అవే పాద ముద్రికలు సత్యం బాబుకి సరిపోయాయి అన్నారు ??? ఏమిటి ఎలా సాద్యం ? ఆరు అడుగులు ఉన్న లడ్డు , పిచుకలా ఉన్న సత్యం బాబు ఇద్దరి పాద ముద్రికలు ఒకే లా ఉంటాయా? మరియు లడ్డు , సత్యం బాబు DNA tests ఒకటేనా?
4 ) సత్యం బాబు తల్లి మాటల్లో చెప్పాలంటే , నా కొడుకు ఈ పాడు పని చేయలేదు, మమల్ని బందించి , సత్యం బాబుని తీవ్రంగా కొట్టి, ఒప్పుకోకపొతే మీ అమ్మ వాళ్ళు మా దగ్గరే ఉన్నారు వాళ్ళని కూడా చంపేస్తాం అని బెదిరించి తప్పు చేసినట్టు చెప్పించారు.
5 ) ఇంకా న్యాయవాదుల మాట ప్రకారం ఈ కేసులో ప్రత్యక్ష సాక్షాలు గానీ , పరోక్ష సాక్షాలు గానీ లేవు అని చెపుతున్నారు మరి న్యాయనిర్ణేతలు ఈ శిక్ష ఎలా విధించారు ? ఎవరికోసం విధించారు?
ఇలా చెప్పుకుంటూ పొతే చాల విషయాలు ఉన్నాయి , ఈ కేసు ద్వారా న్యాయవ్యవస్తపై గౌరవం పోతుంది , రాజకియనయకులను కాపాడటానికి మాత్రమే పోలీసులు , న్యాయవాదులు, న్యాయవ్యవస్త అన్ని కలిసికట్టుగా పనిచేస్తే అంతకన్నా దొర్భాగ్యం ఇంకోటి ఉండదు , సత్యం బాబు కేసులో అదే జరిగింది కాదంటారా?
దీనిపై మీ కామెంట్స్ ఇవ్వండి, లేదా మీ అభిప్రాయాలను ramakrishnapoduru@gmail.com కు మెయిల్ చేయగలరు.
Wednesday, September 29, 2010
అయేషా _సత్యం కేసు బాబు : నిజా నిజాలు ఏమిటి ?
Labels:
ANDHRA NEWS,
RK TOPIC,
Telugu News,
Telugu News update
Tuesday, September 14, 2010
తెలుగు మీడియా విలువలు
Image via Wikipedia
వై . స్ . జగన్ వార్తలు తప్ప ఇంకేమి రాష్ట్రము లో వార్తలు లేవా ? సమస్యలు లేవా? తెలుగు మీడియా విలువలు ఏనాడో దిగ జరిపోయినాయి , కానీ ఇప్పుడు ఇంకా దిగజారిపోయి మీడియాలో వచ్చే వాటికి కనీసపు విలువకూడా లేదు,మీడియా అన్నది ఏంటో విలువైనది అది ప్రజల సమస్యలు, బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలి కానీ కొన్ని మీడియాలు ప్రభుత్వానికి అండగా మరికొన్ని వ్యతిరేఖంగా పని చేస్తున్నాయి కానీ ప్రజల కోసం , సమాజం కోసం మాత్రం పని చేసేవి ఏమీ లేవు.
మెరుగైన సమాజం అని చెప్పే ఒక చానెల్ కూడా పొడిచింది ఎమీ లేదు , తెలుగు దేశంకి మద్దతుగా మూడు చానెల్స్ , రెండు పత్రికలూ , కాంగ్రెస్ కి ఒక పత్రిక, చానెల్ ఇలా అందరు జగనే వార్తలే వేస్తున్నారు , బ్యానర్ వార్తలు జగన్ వె , బ్రేకింగ్ న్యూస్ జగన్ వార్తలే , హెడ్ లైన్స్ కూడా జగన్ వార్తలే కాకపోతే మూడు చానెల్స్ వ్యతిరేఖంగా , సాక్షి అనుకూలంగా అంతె.
వీటికి విలువలేదు , నిజమైన మీడియాకు ప్రభుత్వాలు వణుకుతాయి , అవి పైకి తెసుకువచే సమస్యల పై వెంటనే స్పందిస్తాయి కానీ ఇప్పుడు అటువంటి చానెల్ ఒక్కటి కూడా లేదు , పైపెచు ఎవరికీ చానెల్ కావాలంటే వాళ్ళు ఒక చానెల్ పెట్టేస్తున్నారు , వారికి అంత అంత డబ్బు ఎక్కడినుండి వస్తుంది అని నెఇలదెసే నాధుడే లేదు , ఇన్ని చానెల్స్ వాళ్ళ మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది , ఇంకనుంచి అయినా తెలుగు మీడియా అంత ఒక్క తాటిపై వచ్చి ప్రజల సమస్యలని తెరపైకి తెసుకురావాలని ఆశిద్దాం , జగన్ వార్తలే కాకుండా జగత్ వార్తలు కూడా ప్రసారం చేస్తే బాగుంటది, వీళ్ళు జగన్ జపంతో జనం ని మరిచిపోతే జనం కూడా త్వరలోనే జనం కూడా వాటిని మరిచిపోతారు, జగన్ కు నేను వ్యతిరేఖం కాదు కానీ వార్త ఉన్నపుడు వేయాలి దానికి తగ్గ ప్రాధన్న్యం దానికి ఇవ్వాలి అని నా భావన , ప్రేక్షకులకి ప్రయోజకరమైన చర్చలు , వార్తలు మరియు వినోద కార్యక్రమాలతో ఉండాలి అప్పుడే మీడియాకు అది ప్రసారం చేసే వాటికి కనీసం విలువ అయినా దక్కుతాది.
Labels:
ANDHRA NEWS,
RK Opinion,
Telugu Media,
Telugu News,
Telugu News update,
Y.S.Jagan
దెబ్బతిన్న పులి
దెబ్బతిన్న పులి : పవన్ కళ్యాణ , S.J. సూర్య Combination లో వచ్చిన కొమరం పులి సినిమా అంతగా ఆకట్టుకోవటం లేదు, అభిమనులు ఆశించిన స్తాయిలో లేకపోయినా కానీ వాళ్ళు కూడా నోళ్ళు వేల్లబెట్టేవిధంగా సినిమా ఉంది అని సమాచారం, ఎన్నో హంగులు , ఆర్భాటాలతో పాటుగా అవాంతరాలు దాటి బోను నుండి బయటికి వచ్చిన ఈ పులికి కాలం కలసిరాలేదు అని చెప్పాలి ఎందుకంటే , ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకోవటం , బడ్జెట్ పరిధులు దాటిపోవటం , అనుకున్న సమయానికి విడుదల కాకపోవటం , ముక్యంగా కధ, కధనాలు కుదరకపోవటం అంతే కాక A.R.Rehman సంగీతం కూడా ఏమంత గ్రాండ్ గా లేదు.
అయినా కానీ Collection మాత్రం ఇరగాదిస్తున్నాడు ఇప్పటికే రెండు రోజులకు 12 కోట్లు వసుల్ అయినాయి, సినిమాలో మేటర్ లేకుంటేనే పవన్ ప్రబంజనం ఇలా ఉంది , సినిమా కొద్ది బాగుఉన్నా సూపర్ హిట్ అయ్యేది.
అయినా కానీ Collection మాత్రం ఇరగాదిస్తున్నాడు ఇప్పటికే రెండు రోజులకు 12 కోట్లు వసుల్ అయినాయి, సినిమాలో మేటర్ లేకుంటేనే పవన్ ప్రబంజనం ఇలా ఉంది , సినిమా కొద్ది బాగుఉన్నా సూపర్ హిట్ అయ్యేది.
Labels:
Komram Puli,
Pawan Kalyan,
Puli,
RK Opinion,
Telugu News update
Monday, August 30, 2010
తెలంగాణా వాదుల మూర్ఖత్వం
తెలంగాణా వాదుల మూర్ఖత్వం : ఉస్మానియా యునివర్సిటీ లో సీమంధ్ర ప్రొఫెసర్స్ పై జరిగిన దాడి అమానుషం , దుర్మార్గం ఎవరినా కాదంటారా ? కానీ కెసిఆర్ లాంటి , ఈటెల రాజేందర్ వంటి మూర్ఖ నాయుకుల కంటికి అది దాడి కాదంట ! నిరసన మాత్రమే తెలిపారంట! అంత మాత్రానికే సీమంధ్ర ప్రొఫెసర్స్ కింద పడిపోయారు అంట! Man Handling జరగలేదు అని కెసిఆర్ అంటున్నాడు అవునా ? వాడికి కళ్ళు ఉన్నాయా? పోయాయ ? TV lo రాష్ట్రము మొత్తం చూసారు కానీ ఈ తెరాస వాళ్ళకు మాత్రం కనిపించదు, కళ్ళు ఉంటె కదా వీళ్ళకి , రాజేందర్ అంటున్నాడు ఇటువంటి దాడులు ముందు ముందు ఇంకా జరుగుతాయి అంటున్నాడు వాడికి బుద్ధి ఉందా అని , కడుపుకు అన్నం తింటున్నడా? లేక మంది సంక నాకుతున్నడా ? దాడి చేసినట్లు వివరంగా ఉంటె , అసలు దాడి చేయలేదు , నిరసన తెలిపితే సీమంధ్ర ప్రొఫెసర్స్ కింద పడిపోయారు అంటున్నాడు ఈ కళ్ళు లేని కభోది ,
ఇపుడే ఇలా ఉంటె తెలంగాణా వచినా తరువాతా ఇంకా ఎలా ఉంటాదో ఉహించుకోండి ? అన్నదమ్ములా విడిపోదాం అనే చెప్పిన వాళ్ళు ఏమంటారు దాడే జరగలేదు అంటారు !!!! సిగ్గు సిగ్గు ... లేదు
ఇపుడే ఇలా ఉంటె తెలంగాణా వచినా తరువాతా ఇంకా ఎలా ఉంటాదో ఉహించుకోండి ? అన్నదమ్ములా విడిపోదాం అనే చెప్పిన వాళ్ళు ఏమంటారు దాడే జరగలేదు అంటారు !!!! సిగ్గు సిగ్గు ... లేదు
Labels:
ANDHRA NEWS,
KCR,
RK Opinion,
Telugu News,
Telugu News update
Blind Leaders : KCR & Co
Image via Wikipedia
Yes I will say and concern them as blind leaders are KCR and Co.You know very welll about incident of the OU JAC against the Seemandhra teachers, It very clear in Media Clips but KCR saying "no one MANHANDLE there they just objected" ???
Is it correct?????? is KCR lost his EYES!,, is he Blind Man???
and one more bline man Etela Rajendar, he is telling we will continue like this in future also... is he dont have any shy???? he dont have eyes? blind Man?
Totally TRS Party is Blind Party, the voters who supported TRS also blinders becasue KCR and Co didn't lead Telanga in Progress for Last 10 Years, but the supported voter blind thats why they are voting to TRS Party.
Pliticians should have basics.. but KCR dont have.
Labels:
ANDHRA NEWS,
KCR,
RK Opinion,
Telugu News,
Telugu News update
Wednesday, August 18, 2010
సత్యం కంప్యూటర్స్ అదినేత రామలింగరాజు కు బెయిల్
సత్యం కంప్యూటర్స్ అదినేత రామలింగరాజు కు బెయిల్ : సత్యం కంప్యూటర్స్ ను ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించి పెట్టిన రామలింగరాజు కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
సత్యం : నిజంగా రామలింగరాజు మోసం చేసి ఉండవచు కానీ , ఆయన ఎంతమందికి తిండి పెట్టగలిగారు? అసలు కంప్యూటర్స్ అంటే సత్యం అనుకునే విధంగా అయన మలిచారు , కానీ పాపం అయన ఈ రోజు జైలు లో మగ్గుతున్నారు , అయన స్వయంగా తప్పు చేశాను అని చెపితే కానీ కనిపెట్టలేని అసమర్ద ప్రభుత్వాలు ఉన్నాయ్ , రామలింగరాజు చెప్పకపోతే ఇప్పటికి ఆయన రాజులనే ఉండేవాడు , కాదంటారా ? ఆయన చెపితే అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు అంతే కానీ ఎవరు కానీ పెట్టలేదు.
ఆయన స్వయంగా అరెస్ట్ అవటం , నిజం జనానికి చెప్పటం అభినందనీయం , అదే సంయమలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవటం చాలా బాధాకరం.
ఇక ముందు అయినా ప్రభుత్వాలు తప్పు తెలుసుకుంటే మేలు ...
సత్యం : నిజంగా రామలింగరాజు మోసం చేసి ఉండవచు కానీ , ఆయన ఎంతమందికి తిండి పెట్టగలిగారు? అసలు కంప్యూటర్స్ అంటే సత్యం అనుకునే విధంగా అయన మలిచారు , కానీ పాపం అయన ఈ రోజు జైలు లో మగ్గుతున్నారు , అయన స్వయంగా తప్పు చేశాను అని చెపితే కానీ కనిపెట్టలేని అసమర్ద ప్రభుత్వాలు ఉన్నాయ్ , రామలింగరాజు చెప్పకపోతే ఇప్పటికి ఆయన రాజులనే ఉండేవాడు , కాదంటారా ? ఆయన చెపితే అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు అంతే కానీ ఎవరు కానీ పెట్టలేదు.
ఆయన స్వయంగా అరెస్ట్ అవటం , నిజం జనానికి చెప్పటం అభినందనీయం , అదే సంయమలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవటం చాలా బాధాకరం.
ఇక ముందు అయినా ప్రభుత్వాలు తప్పు తెలుసుకుంటే మేలు ...
Labels:
ANDHRA NEWS,
RK TOPIC,
Telugu News,
Telugu News update
Wednesday, August 4, 2010
చిరంజీవి మారాలి, రాజకీయ అపరిపక్వత వీడాలి
చిరంజీవి మారాలి, రాజకీయ అపరిపక్వత వీడాలి : చిరంజీవి ఇంకా రాజకీయాలను ఒంట పట్టించుకోలేదు, ఏమి మాట్లాడాలి , ఏది మాట్లాడకూడదు కూడా నేర్చుకోలేదు, అభిమానులు చాల వేదన పడుతున్నారు చిరంజీవి రాజకీయ ప్రస్తావన చూసి, కాంగ్రెస్ కు దగ్గర కావాలనే తపన ఎక్కువ అయిపొయింది. చుట్టూ ఉన్న కొటారి చెప్పినట్టు తప్ప సొంతంగా ఏ పనీ చేయలేకపోతున్నాడు.
జగన్ కాంగ్రెస్ వీడితే , రోశయ్య ప్రభుత్వాన్ని మేము మద్దతు ఇస్తాము అని పనికిరాని డైలాగ్ చెపుతున్నారు, తన ఎం. ఎల్ .ఎ లను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. చిరంజీవి ఇంకా మారాలి , కాంగ్రెస్ కు దగ్గర అయ్యే ప్రయత్నాలు మాని , అభిమానులతో , ప్రజలతో , ప్రజా సమస్యలతో మమేకమైన నాడు ఈ సినీ చిరంజీవి నిజంగానే చిరంజీవి అవుతాడు రాజకీయాలలో ... ఏమంటారు ?
జగన్ కాంగ్రెస్ వీడితే , రోశయ్య ప్రభుత్వాన్ని మేము మద్దతు ఇస్తాము అని పనికిరాని డైలాగ్ చెపుతున్నారు, తన ఎం. ఎల్ .ఎ లను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. చిరంజీవి ఇంకా మారాలి , కాంగ్రెస్ కు దగ్గర అయ్యే ప్రయత్నాలు మాని , అభిమానులతో , ప్రజలతో , ప్రజా సమస్యలతో మమేకమైన నాడు ఈ సినీ చిరంజీవి నిజంగానే చిరంజీవి అవుతాడు రాజకీయాలలో ... ఏమంటారు ?
Labels:
Chiranjeevi,
RK Opinion,
RK TOPIC,
Telugu News
Friday, July 30, 2010
తెరాస గెలిస్తే - తెలంగాణా వాదం గెలిచినట్టేనా ?
తెరాస గెలిస్తే - తెలంగాణా వాదం గెలిచినట్టేనా ? : తెరాస ఈ ఉప ఎన్నికలలో గెలిచింది కాబట్టి తెలంగాణా వాదం గెలిచింది అని అంటున్నారు రాజకీయవేత్తలు, నాయుకులు, తెలంగాణా వాదులు ,తెరాస వాదులు మరియు మీడియా.
alaagaite మరి మొన్న ఎన్నికలలో తెరాస ఓడిన ప్రాంతాలలో తెలంగాణా వాదం లేదని వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ..
అప్పుడు ఏమో ఎన్నికలకి సెంటిమెంట్ కి సంబంధం లేదు అంటారు ? ఇప్పుడేమో తెరాస గెలిచింది తెలంగాణా వాదం గెలిచింది అంటున్నారు ..
అపుడు ఓడిపోయినా చోట ఎన్నికలకి సెంటిమెంట్ కి సంబంధం లేనప్పుడు ఇపుడు గెలిచిన చోట ఎలా ఉంటాదో తెరాస వాళ్ళే సెలవుఇస్తే బాగుంటది. ఈ మాత్రం కూడా ఆలోచన , విశ్లేషన లేని మన తెలుగు మీడియా భావదరిద్ర్యానికి సలాం !!?? ఇది కూడా గ్రహించలేని ఓటరులకు కుడా సలాం !!!
alaagaite మరి మొన్న ఎన్నికలలో తెరాస ఓడిన ప్రాంతాలలో తెలంగాణా వాదం లేదని వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ..
అప్పుడు ఏమో ఎన్నికలకి సెంటిమెంట్ కి సంబంధం లేదు అంటారు ? ఇప్పుడేమో తెరాస గెలిచింది తెలంగాణా వాదం గెలిచింది అంటున్నారు ..
అపుడు ఓడిపోయినా చోట ఎన్నికలకి సెంటిమెంట్ కి సంబంధం లేనప్పుడు ఇపుడు గెలిచిన చోట ఎలా ఉంటాదో తెరాస వాళ్ళే సెలవుఇస్తే బాగుంటది. ఈ మాత్రం కూడా ఆలోచన , విశ్లేషన లేని మన తెలుగు మీడియా భావదరిద్ర్యానికి సలాం !!?? ఇది కూడా గ్రహించలేని ఓటరులకు కుడా సలాం !!!
కాంగ్రెస్ ఓటమిని బాగా ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ నాయుకులు
కాంగ్రెస్ ఓటమిని బాగా ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ నాయుకులు : ఈ ఉప ఎన్నికల లో కాంగ్రెస్ ఓటమిని మేము ముందు చెప్పాము అంటే మేము ముందు చెప్పామని, నాకు ముందే తెలుసు అని కాంగ్రెస్ నాయుకులు ఉప్పొంగిపోతున్నారు, అదీ మరి సంగతి , ఇప్పటికి తెరాసదే పైచేయి కావున మళ్లీ .. డిసెంబర్ 9, 2009 పరిస్తితులు వస్తాయి అని అనిపిస్తుంది .. ఏమంటారు , నాకు తెలియక అడుగుతాను వాళ్ళు ఎందుకోసం రాజీనామా చేసారు? మళ్లీ ఎందుకు గెలిచారు? వోట్లు వేసిన ప్రజలకు ఏమైనా తెలుసో లేదో ?
వాళ్ళు రాజీనామాతో తెలంగాణా రాలేదు , పోనీ గెలిపిస్తే వస్తాదా? చెప్పలేము ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయకముందు ఉండే స్టేజి కు మళ్లీ వెళ్లారు అంతే తప్ప వాళ్ళు సాదించింది శూన్యం . ప్రజలకు ఎన్నికల ఖర్చు , అధికారులకు ప్రయాస తప్ప ఏమి లేదు ఇందులో.
వాళ్ళు రాజీనామాతో తెలంగాణా రాలేదు , పోనీ గెలిపిస్తే వస్తాదా? చెప్పలేము ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయకముందు ఉండే స్టేజి కు మళ్లీ వెళ్లారు అంతే తప్ప వాళ్ళు సాదించింది శూన్యం . ప్రజలకు ఎన్నికల ఖర్చు , అధికారులకు ప్రయాస తప్ప ఏమి లేదు ఇందులో.
Thursday, July 29, 2010
దూసుకుపొతున్న తెరాస
ఉప ఎన్నికల ఫలితాల లో 11 స్తానాలలో దూసుకుపొతున్న తెరాస. ఒక్క చోట బిజెపి ఆదిక్యం. టిడిపి , కాంగ్రెస్ కు కలసిరాని ఉప ఎన్నికలు.
సచిన్ శ్రీలంకను డబుల్ తో పీకాడు
సచిన్ శ్రీలంకను డబుల్ తో పీకాడు, శ్రీలంక తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది, సచిన్ డబుల్ సెంచురీ తో వీర విహారం చేసాడు , రికార్డ్స్ పై రికార్డ్స్ చేసుకుంటూ ఎవరికీ అందనత ఎత్తుకు దూసుకుపోతున్నాడు. రైనా కుడా మంచి సహకారంతో ఆడుతున్నాడు , .. సచినా మజాకా అంటూ శ్రీలంక తో ఆడుకుంటున్నాడు.
Labels:
Cricket,
Telugu News,
Telugu News update
సురేష్ రైనా ఇరగదీసాడు- తొలి శతకం
యువరాజు గాయం వాళ్ళ వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని సురేష్ రైనా టెస్ట్ లో కూడా తన ఆటను చూపించాడు, మొట్ట మొదటి శతకం కూడా నమోదు చేసుకున్నాడు, సచిన్ తో కలసి ఇండియాను ఫాలో అప్ గండం నుండి గట్టేకించాడు. రైనా చాలా మంచి ప్రతిభావంతు .. కాదంటారా?
Labels:
ANDHRA NEWS,
RK Opinion,
RK TOPIC,
Telugu News,
Telugu News update
సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు -నాయిని
తెలంగాణాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకోవటం పై తెరాస నేత నాయిని తీవ్రంగా స్పందిచి తెలంగాణాలో తెలంగాణా జనం జగన్ ను తరిమి , తరిమి కొడతారు అని చెపుతున్నారు, పైగా సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు అని నాయిని గారు చెపుతున్నారు . ఇది ఎక్కడ విడ్డూరమో తెలియదు ఇప్పుడు వాళ్ళు అంతె TRS వాదులు ఎక్కడ ఉన్నారో తెలుసా ? వాళ్ళు ఇప్పటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము అన్న విషయం కుడా తెలియని నాయకులా?
భారత దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు , జీవించవచ్చు, వ్యాపారం చేయవచ్చు, పని చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్న విషయం కూడా తెలియదా ?
నాయిని : సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు
కెసిఆర్ : తెలంగాణా వచినా ఆంధ్ర వాళ్ళకు ఇబంది ఏమి ఉండదు ( ఒకసారి చెపుతాడు)
కెసిఆర్ : ఆంధ్ర భాగో .. ఆంధ్ర పేరు కనిపిస్తే కుదరదు (ఇంకోసారి చెపుతాడు )
సో.. ఎవరు మాట నమ్మాలి కెసిఆర్ ఒకటి అంటాడు, నాయిని ఒకటి అంటాడు , రాజేందర్ ఒకటి అంటాడు .. వాళ్ళకే ఒక మాట లేదు , ఇంకా వీళ్ళు తెస్తారు తెలంగాణా ?
ఖచ్చితంగా , న్యాయంగా తెలంగాణా కోసమే పోరాటం చేసేవారు ఎందరు ఉన్నారు? ఉంటె ఈపాటికి తెలంగాణా ఎపుడో వచ్చేది .. ఏమంటారు.
నాయిని మాటలు నిజమంటారా ? సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదా? ఎక్కడ ఉండాలి?
భారత దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు , జీవించవచ్చు, వ్యాపారం చేయవచ్చు, పని చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్న విషయం కూడా తెలియదా ?
నాయిని : సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు
కెసిఆర్ : తెలంగాణా వచినా ఆంధ్ర వాళ్ళకు ఇబంది ఏమి ఉండదు ( ఒకసారి చెపుతాడు)
కెసిఆర్ : ఆంధ్ర భాగో .. ఆంధ్ర పేరు కనిపిస్తే కుదరదు (ఇంకోసారి చెపుతాడు )
సో.. ఎవరు మాట నమ్మాలి కెసిఆర్ ఒకటి అంటాడు, నాయిని ఒకటి అంటాడు , రాజేందర్ ఒకటి అంటాడు .. వాళ్ళకే ఒక మాట లేదు , ఇంకా వీళ్ళు తెస్తారు తెలంగాణా ?
ఖచ్చితంగా , న్యాయంగా తెలంగాణా కోసమే పోరాటం చేసేవారు ఎందరు ఉన్నారు? ఉంటె ఈపాటికి తెలంగాణా ఎపుడో వచ్చేది .. ఏమంటారు.
నాయిని మాటలు నిజమంటారా ? సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదా? ఎక్కడ ఉండాలి?
Labels:
ANDHRA NEWS,
RK Opinion,
RK TOPIC,
Telugu News,
Telugu News update
సాక్షి TV అంటేనే జనం పరుగులు పెడుతున్నారు
సాక్షి దినపత్రిక పెట్టినపుడు అది కేవలం రెండు రూపాయలకే దొరుకుతుంది అని చాలామంది ఉత్సాహంగా కొన్నారు పైగా మిగతా దినపత్రికల తో పోలిస్తే ఎక్కువ పేజీలు రంగుల్లోను లభిస్తుంది అని ఎగబడ్డారు, దాని ఫలితమే ఈనాడు దినపత్రికిను కుడా మించి అమ్ముడు పోయే పత్రికగా నిలిచింది. కానీ జనాన్ని ఆకట్టుకోవటంలో మాత్రం విపలమైంది అని మాత్రం చెప్పక తప్పదు. దానిలో ఎక్కవుగా కాంగ్రెస్ మరియు వై స్ కధనాలే వచ్చేవి, కొంతకాలానికి అవి జనానికి చిరాకుని కలిగించి ముందు అమ్మకాలతో పోల్చితే సాక్షి అమ్మకాలు పడిపోయాయి.
సాక్షి TV కూడా అంతే, మొదట్లో మొట్టమొదటి డిజిటల్ చానెల్ అని జనం ముందుకు వచ్చింది కానీ ప్రేక్షకులని అంతగా అలరించాలేదనే చెప్పకతప్పదు. రాజశేకర్ రెడ్డి చనిపోయిన తరువాత నుండి ఇప్పటి ఓదార్పు యాత్ర వరుకు ఇంకా దిగజారింది. వై స్ జగన్ వార్తలు తప్ప వేరే ఎటువంటి వార్తలు కనిపించటం లేదు. రోజంతా ఓదార్పు యాత్ర మాత్రమే చూపిస్తున్నారు, ఏదో కొద్దిగా లేకపోతె మరి సొంత చానెల్ కాబట్టి ఒక గంట లేక రెండు గంటలు చూపిస్తే బాగుంటది గాని బాజా ఉంది కదా అని వాయిస్తూనే ఉంటె విసుగు వస్తాది...... అవును అదే జరుగుతుంది చానెల్ మార్చినపుడు అయినా సాక్షి వస్తే వెంటనే మార్చేస్తున్నారు మన బుల్లి తెర అభిమానులు. అందుకే దేనికైనా అతి పనికిరాదు అని .. జగన్ అండ్ కో వాళ్ళు చేస్తుంది అదే ....ఏమంటారు మీరు?
సాక్షి TV కూడా అంతే, మొదట్లో మొట్టమొదటి డిజిటల్ చానెల్ అని జనం ముందుకు వచ్చింది కానీ ప్రేక్షకులని అంతగా అలరించాలేదనే చెప్పకతప్పదు. రాజశేకర్ రెడ్డి చనిపోయిన తరువాత నుండి ఇప్పటి ఓదార్పు యాత్ర వరుకు ఇంకా దిగజారింది. వై స్ జగన్ వార్తలు తప్ప వేరే ఎటువంటి వార్తలు కనిపించటం లేదు. రోజంతా ఓదార్పు యాత్ర మాత్రమే చూపిస్తున్నారు, ఏదో కొద్దిగా లేకపోతె మరి సొంత చానెల్ కాబట్టి ఒక గంట లేక రెండు గంటలు చూపిస్తే బాగుంటది గాని బాజా ఉంది కదా అని వాయిస్తూనే ఉంటె విసుగు వస్తాది...... అవును అదే జరుగుతుంది చానెల్ మార్చినపుడు అయినా సాక్షి వస్తే వెంటనే మార్చేస్తున్నారు మన బుల్లి తెర అభిమానులు. అందుకే దేనికైనా అతి పనికిరాదు అని .. జగన్ అండ్ కో వాళ్ళు చేస్తుంది అదే ....ఏమంటారు మీరు?
Labels:
ANDHRA NEWS,
RK Opinion,
RK TOPIC,
Telugu News,
Telugu News update
Subscribe to:
Posts (Atom)